కూరగాయల కోసం రూ.30 అడిగిన భార్య.. చిర్రెత్తుకొచ్చి తలాక్ చెప్పిన భర్త

  • గ్రేటర్ నోయిడాలో ఘటన
  • భార్య ముఖంపై ఉమ్మివేసి గెంటేసిన భర్త
  • భర్త అరెస్ట్.. ఆపై విడుదల
కూరగాయలు కొనేందుకు రూ. 30 కావాలని భార్య అడగడంతో చిర్రెత్తుకొచ్చిన భర్త తలాక్ చెప్పేశాడు. గ్రేటర్ నోయిడాలోని దాద్రీలో గత నెల 29న ఈ ఘటన జరిగింది. జైనాబ్ (30), సబీర్ (35)లు భార్యాభర్తలు. ముగ్గురు అమ్మాయిలు, కుమారుడితో కలిసి దాద్రీలో నివసిస్తున్నారు. ఇంట్లో కూరగాయలు లేవని, తెచ్చేందుకు ముప్పై రూపాయలు కావాలంటూ భర్తను అడిగింది. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కోపంతో ఊగిపోయిన సబీర్ ఆమెకు ముమ్మారు తలాక్ చెప్పేశాడు.

దీంతో జైనాబ్ పోలీసులను ఆశ్రయించింది. భర్త, అత్తమామలు, మరదళ్లు, బావమరుదులు తనపై దాడిచేశారని, ఈడ్చి పారేశారని ఆరోపించింది. వైరుతో ఎలక్ట్రిక్ షాక్ కూడా ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొంది. భర్త తనకు ముమ్మారు తలాక్ చెప్పి ముఖంపై ఉమ్మివేసి గెంటేశాడని బోరుమని విలపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సబీర్‌ను అరెస్ట్ చేసి దాద్రీ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. అనంతరం బెయిలుపై విడుదలయ్యాడు.
Go Back to Shorts
Wife
triple talaq
Vegetables
Greater Noida

More Telugu News